Thursday, September 19, 2024

వరల్డ్ కప్ 2023: నేడు పాకిస్తాన్, శ్రీలంక మధ్య ప్రతిష్టాత్మక పోరు.. సిద్ధమైన ఉప్పల్ స్టేడియం..

వరల్డ్ కప్ 2023:వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ లో భాగంగా మంగళవారం కీలక ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. భారత్ కు దాయదాది దేశమైన పాకిస్తాన్, సరిహద్దున్న మరో దేశం శ్రీలంకలు పోటీపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. హైదరాబాద్ లో వరుసగా ఇది రెండో మ్యాచ్ కావడం ఆసక్తిని నెలకొంది. ఆసియా జట్లు అయినా పాకిస్తాన్, శ్రీలంక నువ్వా? నేనా? అన్నట్లుగా పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మెగా టోర్నిలో నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. అటు దక్షిణాఫ్రికా తో తలపడి శ్రీలంక ఓడిపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ పై భారీ స్కోరు చేసి గెలవాలని చూస్తోంది. ఆసియా కప్ లోఈ రెండు జట్ల మధ్య రసవత్తర పోరు సాగింది. సూపర్ 4 మ్యాచ్ లో శ్రీలంక చేతిలో ఎదరైనా పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కసితో ఉంది. ఇదిలా ఉండగా ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాగుతుండడంతో హైదరాబాద్ వాసుల్లో ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ తరుపున షాహీన్ ఆఫ్రిదీ, హరిస్ రవూఫ్, హసన్ఆలీతో పాక్ ఫేస్ దళం సిద్ధమవుతోంది. వీరితో పాటు ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్ కీలకంగా ఉన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page