వరద సహాయక పనుల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజీ
ఖమ్మం-జనత న్యూస్
పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి ప్రదేశంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల తీరును ఆయన పరిశీలించారు. పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక తీత పనుల వివరాలు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వత పునరుద్ధరణ పనులపై అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి సూచించారు. గండి పూడిక పనులు 24 గంటల పాటు జరగాలని, అవసరమైన మేర అదనపు యంత్రాలు, షిఫ్టులవారీగా కార్మికులు పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాల్వ తవ్వకం, లైనింగ్ పనులు సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఇరిగేషన్ సిఇ విద్యాసాగర్, ఎస్ఇ నర్సింగ రావు, సంబంధిత అధికారులు ఉన్నారు.
వేగిరంగా కాలువను పునరుద్దరించాలి
- Advertisment -