TTD Kalyana Mandpam :తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో కల్యాణ మండపాలను నిర్వహిస్తోది. వీటిలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 250కి పైగా వివాహ వేదికలు ఉన్నాయి. చాలా మంది ఇందులో వివాహం చేసుకునే వారు టీటీడీ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని గ్రహించింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కొందరు ప్రవర్తిస్తుండడంతో తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టీటీడీ బోర్డు సమావేశం సోమవారం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్నయాలకు బోర్డు ఆమోదం తెలిసింది. ఈ ఈ సమావేశంక సంబంధించిన వివరాలను కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నామని, భక్తులు స్వయంగా ఇందులో పాల్గొనవచ్చునని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతున్నట్లునిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్యాణ మండపాల్లో ఇక నుంచి డీజేలు, సినిమా పాటలకు ఆస్కారం లేదని నిర్ణయం తీసుకున్నారు. ఈ కల్యాణ మండపాల్లో కేవలం భక్తి గీతాలు మాత్రమే ప్రసారం అవుతాయని అన్నారు. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.సినిమా పాటలు పెట్టడంపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.