Wednesday, September 18, 2024

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఫోన్‌

ఆదివాసీ మహిళపై లైంగిక దాడిపై ఆరా
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచన
ఢిల్లీ :
తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ఫోన్‌ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31న జైనూర్‌ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ (45)పై ఆటోడ్రైవర్‌ షేక్‌ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతో పాటు తీవ్రంగా గాయపర్చినట్లు ఫిర్యాదు వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డీజీపికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడితో పాటు దాడి చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు కుట్ర చేసిన నిందితుడు షేక్‌ మగ్దూంకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై హత్య, అత్యాచారాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు పంపాలని సూచించారు. అదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page