Thursday, September 19, 2024

Thirumala: శ్రీవారి సేవలో కేసీఆర్ సతీమణి శోభ

Thirumala: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వేకువజామున అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం అర్చకులు శోభను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా స్వామి వారి చిత్రపటాన్ని శోభకు అందించి సన్మానించారు. శోభతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆమె వెంట ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం 68,828 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక కేసీఆర్ కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ కానున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page