తెలంగాణలో రోడ్ల విస్తరణపై
కేంద్ర మంత్రుల చర్చలు
నితిన్ గడ్కరీతో బండి సంజయ్ భేటీ
ఢిల్లీ :
తెలంగాణ లోని రోడ్ల విస్తరణ, పురోగతిలో ఉన్న పనులపై కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసిశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గురువారం ఢిల్లీలో వీరివురు కలసి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతో పాటు కరీంగనర్ పార్లమెంటులో పురోగతిలో ఉన్న పనులపై చర్చించుకున్నారు. కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలను గడ్కరీని అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి కేంద్ర రహదారుల, మౌలిక సదుపాయాల నిధి(సీఆర్ఐఎఫ్) కింద నిధులు విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు.
తెలంగాణలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రుల చర్చలు
- Advertisment -