Wednesday, September 18, 2024

త్వరలో భారత్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడి పర్యటన

మాల్దీవుల జూనియర్‌ మంత్రులు భారత్‌ పర్యాటకులపై చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో వారిని సస్పెండ్‌..తెలిసిన విషయమే. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకారానికి మాల్దీవ్‌ అధ్యక్షులు ముయిజ్జు హాజరు కావడం, గత నెలలో భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మాలేను సందర్శించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అయితే..త్వరలో మాల్దీవు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జూ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఆయన కార్యాలయం ప్రకటించింది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముయిజ్జు తొలిసారిగా అధికారికంగా భారత్‌లో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page