Thursday, September 19, 2024

చెరువుల ఆక్రమణ లపై సమాచారం ఇవ్వండి

రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు
కరీంనగర్‌-జనత న్యూస్‌
చెరువుల ఆక్రమణ లపై అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడేందుకు జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు ఆక్రమణల సమాచారాన్ని ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు తెలిపారు. చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎంతటి పెద్దవారున్నా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. సమాజం బాధ్యతగా భవిష్యత్‌ తరాలకు ఇచ్చే వరం ఇదేనని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రిగా చెరువుల పరిరక్షణకు తమ వంతు సాకారం అందించాలని ఇక్కడి ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ,రంగారెడ్డి ప్రజలు ప్రకృతి పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page