ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆ జ్టటు కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో తాను ఢిల్లీ తరుపున ఆడి ఉంటే ప్లే ఆఫ్ కు వెళ్లేదన్నారు. తన వల్లే ఢిల్లీ గెలుస్తుందని కాదని, ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని చెప్పారు. ఐపీఎల్ 2024లో సీజన్ లో మూడు సార్లు స్లో అవర్ రేట్ నమోదు అయినందున పంత్ పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. ఈ మ్యాచ్ బెంగళూరుతో సాగింది. ఇందులో రిషబ్ పంత్ ఆడలేదు. ఇందులో ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ సారథ్యం వహించాడు. మ్యాచ్లో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 17వ సీజన్ లో తన చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్ గెలిచింది. దీంత ఆ జట్టు ప్రస్తుతం ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాతి మ్యాచ్ ఓడిపోవడంపై రిషబ్ పంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ జట్టుపై రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
- Advertisment -