Rahul Gandhi : హైదరాబాద్, జనతా న్యూస్ : కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. బహిరంగ సభలు కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం ప్రియాంక గాంధీతో కలిసి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. విజయభేరి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. ఆ తరువాత కొల్లాపూర్ లో నిర్వహించాల్సి ఉండేది. కానీ చివరి నిమిషంలో దేవరకద్ర కార్యక్రమం రద్దయింది.
రాహుత్ తో పాటు ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు. అక్టోబర్ 18 నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకలు మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో పర్యటించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లో పర్యటించి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు దక్షిణ తెలంగాణ జిల్లాలో పర్యటిస్తారు. ఈసారి రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు.