దరఖాస్తుకు ఈ నెల 8 వరకు గడువు
18-59 ఏళ్లలోపు వారికి వర్తింపు
కరీంనగర్-జనత న్యూస్
చేనేత, పవర్ లూమ్ కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నేతన్న బీమా పథకానికి చేనేత, మర మగ్గాల కార్మికులతో పాటు అనుబంధ కార్మికులైన డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైన్డింగ్, సైజింగ్, వైపని, బ్లీచింగ్, రోలింగ్ (గమ్మింగ్) కార్మికులు అర్హులు. ఈ పథకంలో నమోదైన కార్మికుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా వర్తిస్తుంది. అర్హుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అధికారులు. 18 నుండి 59 ఏళ్లలోపు కార్మికులు ఈ నెల 8వ తేదీ లోపు తమ పరిధిలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పాస్ పోర్ట్ సైజ్ పోటో, అధార్ కార్డ్, బ్యాంకు ఖాతా జిరాక్స్, నామిని ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా జిరాక్స్ తో జతచేయాలని చేనేత జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఇతర వివరాల కోసం చేనేత జౌళిశాఖ కార్యాలయంలో సంప్రదించాలని వారు సూచించారు.
నేతన్న బీమా పథకము..
- Advertisment -