Nagam Janardhan Reddy : మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా కాంగ్రెస్ లో ఉంటున్న ఆయన నాగర్ కర్నూల్ టికెట్ ను ఆశించారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కూరుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయనను కేటీఆర్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈరోజే బీఆర్ఎస్ కండుగా కప్పుకోనున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగం జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.ఆ తరువాత బీజేపీలోకి చేరారు. 2018లో కాంగ్రెస్ లోకి మారారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉంది.
Nagam Janardhan Reddy : కాంగ్రెస్ కు నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా..? బీఆర్ఎస్ లో చేరే అవకాశం..
- Advertisment -