Wednesday, July 2, 2025

‘రాయల్’ గడ్డపై దూసుకెళ్తున్న ‘కోల్ కతా’..

IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో కోల్ కతా  నైట్ రైడర్స్ విజయపరంపర కొనసాగిస్తోంది. తొలి ఐపీఎల్ తోనే జోరు ప్రారంభం కావడం విశేషం. 2008లో ఆర్సీబీ చేతిలో 140 పరుగులతో ఘోర పరాజయంతో ఐపీఎల్ ప్రచారాన్ని ప్రారంభించిన కోల్ కతా రైడర్స్ ఇప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో బలమైన జట్టుగా గుర్తింపు పొందింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ 12 సార్లు తలపడగా ఆతిథ్య జట్టు రాయల్ చాలెంజ్ బెంగళూరు 4 సార్లు మాత్రమే గెలిచింది. అంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కు  ఈ స్టేడియం బాగా కలిసొస్తుంది.  2017 నుంచి చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ పై ఆర్ సి బి ఒక్క విజయం కూడా సాధించలేదు. 2010లో చిన్న స్వామి స్టేడియంలో ఆర్సిబి తొలిసారి విజయం సాధించింది. దీని తర్వాత 2011 2013లో విజయాన్ని నమోదు చేయడంలో విఫలమైంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page