ఈ నెల 15న రీజినల్ పేజీలో కథనం
పీఎంపీ, ఆర్ఎంపీ లకు ..
శిక్షణ, సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వం అంగీకారం ?
అసోసియేషన్ ప్రతినిధుల పాలాభిషేకం..
కరీంనగర్- జనత న్యూస్
జనత న్యూస్ కథనానికి ప్రభుత్వం నుండి కదలిక వచ్చింది. ఈ నెల 15న జనత రీజినల్ పేజీలో ‘ దాడులు..వెనక్కి’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన పీఎంపీ, ఆర్ఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వచ్చారు. దీంతో వారికి శిక్షణ, సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు కరీంనగర్లో ఈ విషయాన్ని వెల్లడిరచారు. ప్రభుత్వానికి కృతజ్ఞతగా నగరంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం సీఎం, మంత్రి పొన్నం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రత్నం, నగర అధ్యక్షులు గణేశ్ తెలిపారు. ఎంబీబీఎస్, ఎండీ డాక్టర్లకు వ్యతిరేకం కాదని..తమ పరిధిలో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తామని వారు స్ఫష్టం చేశారు.
కాగా..‘‘పీఎంపీ, ఆర్ఎంపీ లపై చర్యలకు వెనకడుగు..ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిళ్లు..ట్రీట్మెంట్, విధి విధానాలపై స్ఫష్టత కరువు’’ ఈ అంశాలపై సమగ్ర కథనం జనత న్యూస్ పత్రికలో ప్రచురితం అయిన విషయం తెలిసిందే. దీనిపై పీఎంపీలు, ఆర్ఎంపీల్లో విస్తృత చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వ పెద్దల సాకారాంతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అసోసియేషన్ ప్రతినిధులు తీసుకెల్లినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నుండి ఇందుకు సంబంధించిన విధి విధానాలు రావాల్సి ఉంది.