I Phone : భారత్ లో ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా బెంగళూరు సమీపంలోని తైవాన్ కు చెందిన విస్ట్రాన్ ప్లాంటును 12.5 కోట్ల డాలర్లకు (సుమారు 1.307 కోట్లు) డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు 10వేల మంది ఉద్యోగులు ఉన్న ఈ ప్రాంతంలో విస్ట్రాన్ సరికొత్త ఐఫోన్- 14 మోడల్ ను అసెంబుల్ చేస్తుంది. ఈ డీల్ తో ఐ- ఫోన్స్ తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ నిలిచిపోనుంది. ఇప్పటివరకు ఫాక్స్ కాన్, పెగాట్రాన్ కార్పొరేషన్ వంటి తైవాన్ కంపెనీలే భారత్లోని తమ ప్లాంట్లలో కాంట్రాక్టు పద్ధతిలో ఐఫోన్స్ తయారు చేసి యాపిల్ కంపెనీకి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం యాపిల్ ఫోన్ల తయారీలో చైనా వాటా 90% ఉంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కారణంగా కేవలం చైనా పైనే ఆధారపడకూడదు అన్న యాపిల్ కంపెనీ వ్యూహంతో భారత్ లో మరింతగా ఐఫోన్ల తయారీకి మార్గం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఐ ఫోన్ల తయారీలో భారత్ వాట కేవలం 7శాతం మాత్రమే. వచ్చే నాలుగైదు ఏళ్లలో దీన్ని 25% కి పెంచాలని యాపిల్ భావిస్తుంది. వీటికి తోడు ప్రభుత్వం ప్రకటించిన పి ఎల్ ఐ పథకంలో కీలక ఎలక్ట్రానిక్ ఉపకారణాలు తయారు చేసే కంపెనీలను ఆకర్షిస్తుంది.
I Phone : భారత్ లో ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధం
- Advertisment -