కరీంనగర్-జనత న్యూస్
వరంగల్ ఆటో నగర్కు చెందిన ఇన్స్పెక్టర్ సైరి రాజేశ్ (42) అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడికి భార్య రాధ, కూతురు హాసిని (11), కొడుకు కార్తికేయ (8) ఉన్నారు. మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి తోటి బ్యాచ్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి తమవంతుగా రూ. 16 లక్షల 80 వేల రూపాయల చేకూర్చారు. గురువారం ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి , రమేష్, శ్రీనివాస్ , ఎల్ ఎం డి ఇన్స్పెక్టర్ స్వామి కలసి మృతుడి భార్య, పిల్లలకు అందించారు. సైరి రాజేష్ (42) అనారోగ్య కారణంగా గత ఫిబ్రవరి నెలలో మృతి చెందారని..ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.