చరిత్రలో ఎప్పుడూ చూడలే !
జడ్పీ సీఈవో పెట్టిన కేసును ఎత్తివేయాలి
ఎమ్మెల్యే కౌశిక్తో కలసి సీపీకి మాజీ మంత్రి గంగుల ఫిర్యాదు
కరీంనగర్`జనత న్యూస్
సమస్యలపై ప్రశ్నిస్తే ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అకారణంగా తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమీషనరేట్లో సీపీ అభిషేక్ మహంతిని కలసి జడ్పీ సీఈవో శ్రీనివాస్పై మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలసి ఫిర్యాదు చేశారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లాలో మాత్రమే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం దురదృష్టకరమన్నారు. జడ్పీ, అసెంబ్లీ వేదికలున్నదే ప్రశ్నించేందుకని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన తప్పుడు కేసును ఉప సంహరించుకోవాలని కోరారు. అందరినీ సమాన దృష్టిలో చూస్తామని సీఎం రేవంత్ చెప్పిన మూడు రోజులకే ఇలా కక్ష సాధింపు చర్యలకు ఎలా పాల్పడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులపై కక్ష్య పూరిత చర్యలు జరుగకుండా చూడాలని సీఎంకు సూచించారు ఎమ్మెల్యే గంగుల. దళిత బంధు పెండిరగ్ నిధుల విడుదల, పేద విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని మాత్రమే కోరానని..తనపై జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. తనపై ఎఫ్ఐఆర్ చేస్తే, తనను మాట్లడకుండా అడ్డుకున్న సీఈవో శ్రీనివాస్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీపీని కోరారు. కరీంనగర్ డీఈవో, సీఈవో లపై అసెంబ్లీ స్పీకర్ ద్వారా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయిస్తానని తెలిపారు. వారి వెంటన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, నాయకులు ఉన్నారు.
జడ్పీలో ప్రశ్నిస్తే.. కేసు నమోదు చేస్తారా..?
- Advertisment -