Friday, September 12, 2025

ELephent Smashes Godwon: ఆహారం కోసం ఏనుగు బీభత్సం..(వీడియో)

ELephent Smashes Godwon: కర్ణాటక రాష్ట్రంలో ఓ ఏనుగు హల్ చల్ సృష్టించింది. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా గోదాంలోకి ఆహారం కోసం వెళ్లి బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులోని గుండ్లుపేటలో అటవీ ప్రాంతం ఉంది. అది దట్టమైన అడవి కానున్నందున ఇక్కడ జంతువులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన  గోదాం కూడా ఉంది. తాజాగా ఒక ఏనుగుకు బాగా ఆకలేసినట్లు ఉంది. దీంతో ఆహారం కోసం నేరుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాం లోకి వచ్చింది. పెద్ద ఏనుగు రాకతో అక్కడ పనిచేసే కార్మికులంతా షాక్ అయ్యారు. అరుపులతో పరుగులు తీశారు. గోదాం ఏరియాలోకి వచ్చిన ఏనుగు నేరుగా అందులోకి వెళ్లి  మూసి ఉన్న షట్టర్లను బలంగా పగలగొట్టింది. లోపలికి వెళ్లి ఓ బియ్యం బస్తాను బయటకు తీసుకువచ్చి తన ఖాళీతో అదిమి  తొండంతో బస్తాను పగలగొట్టింది. ఆ తర్వాత బియ్యాన్ని నోట్లో వేసుకుంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అయితే అడవుల్లో ఉండే జంతువులకు సరైన ఆహారం దొరకడం లేదని అనడానికి ఇదే నిదర్శనం..  అని కొందరు నెటిజన్లు  కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోను నరేష్ నంబిషన్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page