మహిళలపై నేరాలు క్షమించరానివి..
కోల్కత్తా, ఇతర ఘటన లపై ప్రధాన మంత్రి మోదీ వ్యాఖ్యలు
మహారాష్ట్ర :
కోల్ కత్తా ఘటన, ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పందించారు. బాధిత కుటుంబాలతో పాటు మహిళల్లో భరోసా నింపేలా పలు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర జల్గావ్లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మెళన్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని..స్థానిక మహిళ లతో సంభాషించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక నుండి బాధిత మహిళలు ఇంటి నుండే ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చని, పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలో పొందు పర్చామన్నారు. కోల్ కత్తా లో జరిగిన హాత్యాచార ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదుకు అక్కడి ప్రభుత్వం ఆలస్యం చేసిందని సుప్రిం కోర్టు చెప్పిన విషయాలను గుర్తు చేశారు ప్రధాన మంత్రి మోది. మహిళలపై జరిగే నేరాలు క్షమించ రానివని..నేరాలకు పాల్పడే వారెంతటి వారైనా వదిలి పెట్టకూడదని, వారికి సాయం చేసిన వారినీ వదలొద్దని..ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. ‘‘ఆసుపత్రి, పాఠశాల, కార్యాలయం, ఇతర ఏ సంస్థలో అయినా నిర్లక్ష్యంగా ఉంటే చర్య తీసుకోవాలి’’ అని ప్రభుత్వాలను ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఇంటి నుండే ఈ-ఎఫ్ఐఆర్..
- Advertisment -