ఏ పార్టీవారినైనా వదలం !
పరిపాలన కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య
17, 18 లలో రాజకీయ విద్వేష ప్రకటనలొద్దు
ప్రతిపక్షాలకు రాష్ట్ర మంత్రి పొన్నం వినతి
కరీంనగర్-జనత న్యూస్
శాంతి భద్రతలకు భంగం కల్గిస్తే ఏ పార్టీ నేతనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని..హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని, 17,18 వ తేది వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు, ప్రకటనలు చేయడానికి వీలు లేదని ప్రతిపక్ష పార్టీల నేతలకు సూచించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు 10 నెలలోనే అసహనానికి గురై ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం మండి పడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశం హైకోర్టు లో ఉందని, అది శాసన సభ చూసుకుంటుందన్న ఆయన..రాజకీయ విమర్శలు చేసి కొట్లాడుకోవాలనుకుంటే వినాయక నిమజ్జనం తరువాత చూసుకోండని హితవు చెప్పారు. పరిపాలన చేయడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.
శాంతి భద్రతలకు భంగం కల్గిస్తే..
- Advertisment -