Beers : ముంబయ్: మద్యపానాన్ని నిషేధించాలని మహిళలు నిత్యం ఆందోళనలు చేస్తుంటారు. కానీ అత్యధిక ఆదాయం మద్యంతోనే కనుక వాటి అమ్మకాలను నిషేధించడానికి ప్రభుత్వాలు ముందుకు రావు. అయితే తాజాగా ఆ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. దీంతో ఆదాయం పడిపోయింది. బీర్ల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యకంగా కమిటీ వేసింది. స్కూళ్లలో సమస్యలు పరిష్కరించాడానికి కమిటీ అక్కర్లేదా? అని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో బీర్ల అమ్మకాలు పడిపోయాయి. ఎందు కంటే నవంబర్ 1 నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి. పర్మిట్ రూమ్ మద్యంపై వ్యాట్ ను 5 శాతం పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5 శాతం వ్యాట్ ఉండగా.. మరో 5 శాతం పెంచితే మొత్తం 10 శాతానికి మారుతుంది. దేశంలో బీరుపై అత్యంత ఖరీదైన పన్ను మహారాష్ట్రలోనే ఉంది. ఆ తరువాత కర్ణాటక, గోవా ఉన్నాయి. అయితే వ్యాట్ పెంచకముందే బీర్ల అమ్మకాలు తగ్గడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీర్ల సేల్స్ తగ్గడంపై ప్రత్యేక కమిటీ వేయనుంది.
అయితే దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. మద్యపానం అమ్మకాలపై ప్రభుత్వం ఎందుకు అంత ఇంట్రెస్టు పెడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్యంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇలా మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.