Saturday, July 5, 2025

Bengalore: కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం..

Bengalore:  120 అడుగుల భారీ రథం కుప్పకూలింది. బెంగళూరు సమీపంలోని మద్దూరమ్మ జాతరలో జరిగిన ఈ అపస్తృతితో భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. బెంగళూరు అనేకల్ తాలూకాలోని హంస్కూరు లో ప్రతి ఏడాది మద్దూరమ్మ జాతర జరుపుకుంటారు. జాతరలో భాగంగా 10 గ్రామాల ప్రజలు పెద్ద రథాలను అలంకరించి ఊరేగిస్తారు. ఈ సంవత్సరం కూడా జాతర కోసం అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఊరేగింపు కోసం నాలుగు రథాలను ఏర్పాటు చేసి వీటిని ట్రాక్టర్లు, ఎద్దులతో లాగడానికి సిద్ధం చేసి ఉంచారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 125 అడుగుల భారీ రథాన్ని అలంకరించి తాళ్ల సాయంతో పైకి లేపారు. అనంతరం పట్టుకోల్పోయిన  రథం పక్కకు ఒరిగి ఒక్కసారిగా కుప్పకూలింది.  దీంతో భక్తులు పరుగులు తీశారు. అదృష్టవంశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page