ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో వైఎస్ ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా సినీ స్టార్ అల్లు అర్జున్ ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ కారణంగా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ర్యాలీపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలపై టూ టౌన్ ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూకా ఏసి కానిస్టేబుల్ నాగరాజును పీఆర్ కు బదిలీ చేశారు. మే 11న నంద్యాల వచ్చిన అల్లు అర్జున్ తన ఫ్రెండ్, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఈ ర్యాలీకి అనుమతి లేదని కొందరు ఫిర్యాదు చేయగా అల్లు అర్జున్, రవిలపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పి రవీందర్ రెడ్డి, టూ టౌన్ సి ఏ రాజారెడ్డి ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది, వారిపై 60 రోజుల్లో శాఖ పరమైన విచారణ పూర్తి చేయాలని సూచించింది.
అల్లు అర్జున్ ర్యాలీ.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు..
- Advertisment -