Friday, September 12, 2025

వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

Narendra Modi: లోక్ సభ 2024 ఎన్నికల సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లోక్ సభ స్థానానికి  నామినేషన్ వేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్ర పక్షాలు హాజరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,  జితన్ రాం మాంఝి,  ఓం ప్రకాష్ రాజ్ బర్,  సంజయ్ విషాద్ తదితరులు హాజరయ్యారు.  అంతకు ముందు ఆయన బాబా కాల భైరవుడికి ప్రార్థన చేశారు. ఆ తరువాత  గంగానది దశాశ్వ మేద ఘాట్ వద్ద పూజలు చేసి  గంగా హారతి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయం వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ నుంచి  ఎంపీగా  పోటీ చేయడం ఇది మూడోసారి.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page