ముంబయ్: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో చెత్తకుప్పలో కుప్పగా పని ఉన్న ఓటర్ ఐడీ కార్డులను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ కృష్ణకాంత్ వెల్లడించారు. అయితే ఓటర్ ఐడీలన్ని పాతవని, గడువు ముగిసిన ఓటర్ ఐడి లు అని తెలిపారు. ఓటర్ ఐడి అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని వివరించారు. చెత్తకుప్పలో ఉన్న ఓటర్లకు కొత్త ఓటర్ ఐడి కార్డులు ఎన్నికల సంఘం జారీ చేసిందని తెలిపారు. కాగా ఇలా చెత్తకుప్పలో పడేయడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెత్తకుప్పల్లో ఓటర్ ఐడీ కార్డులు.. విచారణకు ఆదేశం
- Advertisment -