Friday, September 12, 2025

Youtubers : యూట్యూబర్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: యూట్యూబర్ల విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  తమిళనాడులోసత్తాయ్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ హోస్ట్‌ దురై మురుగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై తాజాగా సుప్రీం కోర్టు విచారణ జరిపింది.  దురైమురుగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై న్యాయమూర్తులు అభయ్‌ ఎస్‌. ఓకా, ఉజ్జల్‌ భుయాన్‌ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం యూట్యూబర్‌ కు మంజూరయిన బెయిల్‌ ను పునరుద్ధరించింది. ఇదే సమయంలో రాష్ట్రం తరఫున  సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని ఉద్దేశించి సుప్రీం న్యాయమూర్తి ఓకా కీలక సవాలును లేవనెత్తారు.ఎన్నికలకు ముందు యూట్యూబ్‌ లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంత మందికి జైలు శిక్ష పడుతుందో ఊహించండి అన్నారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పై దురైమురుగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింనందుకు ఆయనను అరెస్టు చేశారు. తర్వాత అతడు బెయిల్‌ పై బయటికొచ్చారు. కానీ మద్రాస్‌ హైకోర్టు అతడి బెయిల్‌ ను రద్దుచేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో కోర్టు ఆయనకు బెయిల్‌ ను పునరుద్ధరించింది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page