హైదరాబాద్, జనత న్యూస్: మహిళా క్రికెటర్లు పై అసభ్యంగా ప్రవర్తించినందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కోచ్ ను సస్పెండ్ చేసింది. బస్సులో మద్యం తాగి తమను ధూషించారని కొందరు మహిళా క్రికెటర్లు గత నెల 12న మెయిల్ ద్వారా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్ సి ఏ విచారణకు ఆదేశించింది. మరోవైపు కోచ్ ను తక్షణమే తప్పిస్తున్నట్లు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. మహిళా క్రికెటర్లకు రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, వారికి హెచ్ సీఏ అండగా ఉంటుందని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ఆయన అన్నారు. అలాగే మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. విచారణ పూర్తయ్యే వరకు కోచ్ జయసింహ సస్పెండ్ లోనే ఉంటారని ఆయన వెల్లడించారు.
Women Cricketers: మహిళా క్రికెటర్లపై అసభ్య ప్రవర్తన.. కోచ్ సస్పెండ్..
- Advertisment -