Friday, July 4, 2025

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌తో..

రిలయన్స్‌, జీయో దిగొస్తాయా..?
నెట్‌వర్క్‌ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ సరికొత్త ఒరవడితో ముందుకెళ్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తాము సైతం అంటూ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్‌ జీయో, ఎయిర్‌ టెల్‌ నెట్‌వర్క్స్‌ కంటే మిన్నగా గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ. రూ. 347 ప్లాన్‌లో 54 రోజుల ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు, త్రీ జీబీ డేటాతో పాటు అదనంగా 3జీబీ డేటా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. వీటితో పాటు మరిన్ని అదనపు అడ్వేంచర్స్‌ను ప్రకటించింది. తక్కువ ఛార్జీలతో ఎక్కువ సేవలు పొందే అవకాశాలు కల్పించడంతో..ప్రస్తుత జీయో, ఏయిర్‌టెల్‌ సంస్థలు అంతకు మించి ఆఫర్స్‌ ప్రకటిస్తాయా..బీఎస్‌ఎన్‌ఎల్‌ను తట్టుకుంటాయా.. అనే చర్చ జరుగుతోంది. కాగా..ఇప్పటికే యూజర్లు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్టు చేసుకుంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page