యూనియన్ ఆప్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్స్ (UEFA)తో ప్రముఖ బ్రాడ్ కాస్టర్ సోనీ పిక్చర్స్ మీడియా కాంట్రాక్టును మరో మూడు సీజన్లకు పునరుద్దరించుకుంది. దీంతో 2027 వరకు చాంపియన్ లీగ్స్ తో పాటు యూరప్ నకు చెందిన పలు లీగ్స్ లో 1600 ఫుట్ బాల్ మ్యాచ్ లను ఇండియాలో టీవీ, ఓటీటీల్లో లైవ్ కవరేజ్ ఇవ్వనుంది. UEFAపోటీలు హలాండ్ తో సహా ప్రపంచ ఫుట్ బాల్ పోటీలను తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం చేయనుంది. ఈ మేరకు పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా చీఫ్ మాట్లాడుతూ అత్యుత్తమ ఫుట్ బాల్ ను ప్రదర్శించాలనే దీర్ఘకాల నిబద్దతతో సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ UEFA తో భాగస్వామ్యం చేసుకున్నట్లు తెలిపారు.
2027 వరకు UEFA -SONY కాట్రాక్టు పొడగింపు
- Advertisment -