ప్రజలు సినీ నటులను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రధాన మంత్రిని మించీ సోషల్ మీడియాలో వారిని ఎక్కువగా ఫాలో అవుతున్నారనే విషయం విస్మయానికి గురి చేస్తుంది. ఇన్స్టాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ఇప్పుడు థర్డ్ ప్లేస్కు చేరుకోవడం ఇందుకు నిదర్శనం. ఆమెకు 91.4 మిలియన్ల ఫోలోవర్స్ ఉండడం విశేషం. మొదటి స్థానంలో కోహ్లీ ఉండగా, రెండో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. గతంలో మూడో స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉండగా, ఆ స్థానాన్ని శ్రద్ధా కపూర్ ఆక్రమించారు. బాహుబలి, సాహు సినిమాల్లో నటించిన శ్రద్ధా కపూర్..తాజాగా విడుదలైన స్త్రీ`2 సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో రూ. 500 కోట్ల కలెక్షన్ దాటేసిందంటే..ఈ సినిమా ఏ మేరకు హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్స్టాలో ఆమెను ఫాలో అయ్యే సంఖ్య పెరగడం, ప్రధాన మంత్రిని సైతం దాటేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే..క్రికెటర్లు, సినీ హీరోయిన్స్ను ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నారనే దానికి తాజా ఉదాహారణ శ్రద్ధా కపూర్కు ఫాలోవర్స్ పెరగడమే.
టాప్ త్రీలో బాలీవుడ్ తార శ్రద్దా కపూర్
- Advertisment -