కార్తీకమాసంలో ప్రారంభించేలా కృషి
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం
వేములవాడ-జనత న్యూస్
తిరుమల తరహాలో వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలోనూ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేములవాడ స్వామి వారిని దర్శించుకున్న తరువాత విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలసి ఈ విషయాన్ని వెల్లడించారు మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయం ఇదేనని, దేవాలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యానికి అనుగుణంగా శృంగేరి పీఠాధిపతి సలహా సూచన మేరకు ఆలయ విస్తరణ చేపడుతామన్నారు. రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నామని, ఇందుకు భక్తులు, దాతలు కూడ ముందుకు రావాలని కోరారు. తిరుమల లో వెంగమాంబ సత్రం మాదిరి వంటకి సంబంధించి అత్యాధునిక సామాగ్రి తో సహా అన్ని ఏర్పాట్లు చేసే శక్తిని రాజ రాజేశ్వర స్వామి ప్రసాధించాలని ఆకాంక్షించారు. నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి ఆది శ్రీనివాస్తో కలసి కృషి చేస్తామన్నారు. వేములవాడ లో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని టూరిజంకు అప్పగించారని, కుల సంఘాల ప్రతినిధులు సత్రాలు నిర్మించుకుని భక్తులకు ఆశ్రయం కల్పిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.