Telangana Political : తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మునుగోడు నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఉన్న నేత డీకే అరుణ కూడా పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన డీకే అరుణ.. తిరిగి అదే పార్టీలోకి మారుతున్నట్లు చర్చలు పెట్టుకుంటున్నారు. ఇటీవల బీజేపీ నుంచి పోటీ చేయనని అరుణ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ నుంచి మక్తల్ లేదా నారాయణ పేట నియోజకవర్గం తరుపున పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఆమె తొలుత గద్వాల నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఆ తరువాత పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే నారాయణ పేట నుంచి టికెట్ ఆశించగా బీజేపీ నాయకత్వం ఒప్పుకోలేదని, దీంతో కాంగ్రెస్ నుంచి ఆ స్థానం టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే పార్టీ మారే విషయంపై డీకే అరుణ క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ్ డీకే అరుణ పార్టీ మారితే మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ పట్టుకోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు.
Telangana Political : తెలంగాణ బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి జాతీయ నేత?
- Advertisment -