Tamilanadu: తమిళనాడు రాష్ట్రంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. విరుద్నగర్ జిల్లా కార్యాపట్టిలోని ఓ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి కార్మికుల ఎగిరిపడ్డారు. పేలుడుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఒక తెల్లటి భవనం వద్ద బాలి పేలుడు జరిగినట్లు తెలుస్తోంది .ఇక్కడి క్వారీపై స్థానికులు కొన్నేళ్లుగా ఫిర్యాదులిస్తున్నారు. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో ఇదే జిల్లాలోని టపాసులు తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి 10మంది మరణించిన విషయం తెలిసిందే.
Tamilanadu: తమిళనాడులో పేలుడు ఘటనలో నలుగురు మృతి
- Advertisment -