వరంగల్, జనతా న్యూస్: నిరుద్యోగ యువత జాబ్మెళాను సద్వినియోగం పర్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ యువతకు పిలుపునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో టి.యం.ఐ ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లుగా ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
For E Paper..
Click Here..

ఈ నెల 16 శనివారం రోజున స్థానిక హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహిస్తారన్నారు.సూమారు 3వేలకు పైగా ఉద్యోగాల కోసం వివిధ ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలను చేపడుతాయన్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొను యువత కనీసం పదవ తరగతి పాసై ఉండాలని, ఇందులో పాల్గొనాలనుకునేవారు ముందుగా bit.ly/jmform సైట్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.