హైడ్రాకు మినహాయింపేనా ?
ఢిల్లీ :
దేశ వ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రిం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ తదితర రాష్ట్రాల్లో బుల్డోజర్ కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జామత్ ఉలేమా హింద్ ప్రధాన పిటిషనర్గా విచారణ చేపట్టిన సుప్రిం కోర్టు..కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 వరకు బుల్డోజర్ కూల్చివేతలు నిలిపి వేయాలని చేసిన ఆదేశాలు..పలు రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు బ్రేక్ వేసినట్లయింది. అయితే.. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, చెరువులు, కుంటల విషయంలో ఈ ఆదేశాలు వర్తించవని కోర్టు తేల్చి చెప్పడం విశేషం. దీంతో తెలంగాణలోని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థకు మినహాయింపేనట్లుగా ఉన్నాయి సుప్రిం కోర్టు ఆదేశాలు. జల వనరుల పరిరక్షణ, ఆక్రమణల కూల్చివేత కోసం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ కొద్ది కాలం క్రితం వరకు దూకుడుగా వ్యవహరించింది. ఈ మధ్య కాలంలో కొంత విరామం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత సుప్రిం కోర్టు మినహాయింపుల నేపథ్యంలో నీటి వనరుల స్థలాల ఆక్రమణల తొలగింపు చర్యలేమైనా చేపడుతుందా..? అనేది వేచి చూడాలి.
సుప్రిం కోర్టు ఆదేశాలు..
- Advertisment -