యదాద్రి భువనగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టుబుల్ దుర్మరణం చెందాడు. యదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెంకు చెందిన మధు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (ఎస్పీఎఫ్)గా పనిచేస్తున్నాడు. మధు మోటార్ సైకిల్ పై నల్లగొండ వెళ్తుండగా వెంకటాపురం వద్ద అతడి బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం
- Advertisment -