Thursday, September 11, 2025

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: సీపీ అనురాధ

  • సీపీ అనురాధ వెల్లడి
  • నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • అనుమాన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్ష..
  •  రైతులను మోసం చేయాలని చూస్తే సహించిలేదని హెచ్చరిక
  • నకిలీ విత్తన అక్రమార్కులపై పీడియాక్ట్ అమలు..

సిద్దిపేట,జనత న్యూస్: నకిలీ విత్తనాల రవాణ,విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని..అక్రమార్కులను ఉపేక్షించేది లేదని సీపీ అనురాధ వెల్లడించారు.అదివారం సీపీ అనురాధ సమావేశం ఏర్పాటుచేసి నకిలీ విత్తనాలను అరికట్టడానికి పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలపై వివరాలు వెల్లడించారు.ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలు, కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలంటూ రైతులకు అమ్మడం తీరా సాగు చేశాక దిగుబడి రాక నష్టపోతున్నారని అన్నారు.రైతులు నకిలీ,కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నకిలీ,కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం,డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు.వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలను అరికట్టడానికి వ్యవసాయశాఖ,టాస్క్ ఫోర్స్,ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు రైతులను మోసం చేసే, నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి గతంలో కేసులు నమోదైన వారిపై నిఘా ఏర్పాటు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సిద్దిపేట జిల్లా పరిధిలో విత్తన,ఎరువుల దుకాణాలను, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీలు, అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షలకు పంపిస్తూ రవాణా వాహనాలను ఆకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు.లైసెన్స్ లు లేకుండా వ్యాపారం చేసే వారిపై, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేల ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణాను, సరఫరా నిరోధించేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. నకిలీ విత్తన అక్రమార్కులపై పీడియాక్ట్ అమలు చేయడానికి వెనుకడుగు వేయమని హెచ్చరించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page