కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు..
మంత్రి బండి సంజయ్ వినతి
సానుకూలంగా స్పందించినట్లు వెల్లడి
ఢిల్లీ :
రాజన్న సిరిసిల్ల జిల్లాకు పవర్ లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఢల్లీి గిరిరాజ్ సింగ్ను కలసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించారని, సిరిసిల్ల నేతన్నల పరిస్థితులను గిరిరాజ్ సింగ్కు క్షున్నంగా వివరించినట్లు బండి సంజయ్ తెలిపారు. నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యార్న్ డిపో ఏర్పాటు చేయాలని, యార్న్ సబ్సిడీ 80 శాతంకు పెంచాలని కోరారు. పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటైతే.. యంత్రాల ఆధునీకరణతోపాటు ఉత్పిత్తి పెరిగి, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అట్లాగే యార్న్ డిపో ఏర్పాటు వల్ల సిరిసిల్లో నేత కార్మికులకు ముడి సరకులు తక్కువ ధరకు లభిస్తాయన్నారు. ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చులవల్ల ముడిసరకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నరు. ఈ నేపథ్యంలో నూలు రాయితీ పెంపుతో పాటు పావులా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బండి సంజయ్ విజప్తిపట్ల జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ మంజూరు చేయండి

- Advertisment -