Friday, September 12, 2025

సిద్ధిపేట: సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలు: సీపీ అనురాధ

సిద్దిపేట,జనత న్యూస్:  రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ సంక్లిప్త సందేశాలు ఎస్ఎంఎస్, మరియు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ సందేశాలు పంపే వారిపై,దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ తెలిపారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ నిబంధనలు ఉల్లంఘించే విధంగా పోలింగ్ కు 48 గంటల ముందు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఎవరైనా రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ ఎస్ఎంఎస్ లు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా అభ్యంతరకరమైన సందేశాలు ప్రసారం చేసే వారిపై జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ ఎస్ఎంఎస్ లు పంపించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై అభ్యంతరమైన పోస్టులు పెట్టే వారి వివరాలను వెంటనే సిద్దిపేట కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667306,సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని పోలింగ్ 48 గంటల ముందు ఎవరు కూడా ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ ఎస్ఎంఎస్ లు పంపించకూడదు, పంపించిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఐపీసీ మరియు ఆర్పీ యాక్ట్ 1951, ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సమిష్టి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ బీ.అనురాధ తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page