ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బుధవారం కేశవపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేశవపట్నం మండలం లింగాపుర్ గ్రామంలో బండి సంజయ్ రేఖ పట్టి కల్లు తాగారు. అనంతరం కల్లు గీత కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మికుడి తో ముచ్చటిస్తూ.. ఈ గ్రామంలో ఎంతమంది కల్లు గీత కార్మికులు ఉన్నారు? ఎంత కల్లు అవుతుంది? ఆదాయం ఎంత ? వగైరా అంశాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు. సరదాగా గౌడన్న మోపు వేసుకొని సంజయ్ కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న సంజయ్. అరోగ్య నిపుణులు సైతం ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. వైన్స్, బార్లు పెట్టీ కేసిఆర్ గౌడన్నల పొట్ట కొట్టిండని అన్నారు. 73 ఏళ్ల వయసు పై బడిన గౌడన్నలు ఇప్పటికీ కల్లు గిస్తున్నారన్నారు.
