-కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్.సుబ్బరాయుడు
కరీంనగర్ (జనతా న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం , ఇతరములను నిరోధించుటకు పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు , ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు జిల్లా లోని కరీంనగర్ పట్టణ డివిజన్ లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ వద్ద ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు వాహన తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా TS 09 UD 5198 వాహనం నందు సరైన పూర్తి ఆధారాలు లేని 2 కోట్ల 36 లక్షల 48 వేల 494 రూపాయలను డబ్బు పట్టుకుని, ఎన్నికల నియమావళి ప్రకారంగా స్వాధీన పరుచుకున్నామని వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారి మరియు ఆదాయ పన్నుశాఖ వారికీ సమాచారమందించామన్నారు.
తదుపరి చర్యల నిమిత్తం రిటర్నింగ్ అధికారి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ కి అప్పగించినట్లు తెలిపారు.ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 2 కోట్ల 84 లక్షల 67 వేల 452 రూపాయలు పట్టుబడిందని తెలిపారు.ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుకోవడం లో కృషి చేసిన ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు , ఎస్ఐ చీనా నాయక్ , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , జ్ఞానేశ్వర్ , కానిస్టేబుల్ రవీందర్ మల్లయ్య లను పోలీస్ కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రిటర్నింగ్ అధికారి (RDO) కె.మహేశ్వర్, ఏసీపీ టౌన్ నరేందర్ , టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.రాంచందర్ రావు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.