సిద్దిపేట,జనత న్యూస్: పొన్నాల శివారులో గల ఇందూరు కళశాలలో ఏర్పాటు చేసిన సిద్దిపేట నియోజకవర్గ ఈవీఎంల భద్రత ఏర్పాట్లను మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎం. మనుచౌదరి తో కలిసి క్షేత్ర స్థాయిలో మంగళవారం పరీశిలించారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాలు ప్రకారం రిజిస్టర్, లాగ్ బుక్, ఇతర రికార్డుల మెయింటెనెన్స్ చెయ్యాలని,సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు.కేంద్ర బలగాలతో నిరంతర పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పరిశీలకులు అధికారులకు తెలిపారు.అనంతరం అసెంబ్లీ స్థాయి శిక్షణ అందించేందుకు ఉపయోగించే ఈవీఎం యంత్రాల భద్రత గదులు,కమీషనింగ్ రూం లను పరిశీలించారు. అంతకుముందు సాధారణ పరిశీలకునికి జిల్లా ఎన్నికల అధికారి పూల మొక్కను అందజేసి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. సిద్దిపేట ఏఆర్ఓ,ఆర్డీఓ సదానందం కు ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం పూర్తి ఎన్నికల ప్రక్రియ నిర్వహణ జరగాలని సూచించారు.
ఈవీఎంల భద్రత ఏర్పాట్ల పరిశీలన
- Advertisment -