Thursday, September 19, 2024

క్యూ న్యూస్‌ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై అసత్య ప్రచారం..
ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని రెడ్డి ఐక్య వేదిక డిమాండ్‌
కరీంనగర్‌-జనత న్యూస్‌
ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్లపై అసత్య ప్రచారం చేస్తున్న క్యూ న్యూస్‌ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి. కరీంనగర్‌లో ఐక్య వేదిక ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2019లో పార్లమెంటు సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లపై రాజ్యాంగ విరుద్దంగా, అగ్ర వర్ణాల పేదలకు నష్టం కల్గించేలా తీన్మార్‌ మల్లన్న అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 20 శాతం అగ్ర వర్ణ కులాల ప్రజలు ఉన్నట్లు తేలిందని, ఇందుకు విరుద్దంగా 6.8 శాతం మాత్రమే ఓసీ జనాబా ఉన్నట్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. 50 ఎకరాల భూమి ఉన్నవారికి ఈ డబ్ల్యూ ఏస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న తీన్మార్‌ మల్లన్న వెంటనే క్షమాపన చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదెకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తించే అవకాశాలున్నట్లు తెలిపారు తిరుపతి రెడ్డి. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్‌ మల్లన్న ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశం లో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేకులపల్లీ రవీందర్‌ రెడ్డి, రెడ్డి జేఏసీ ఉత్తర తెలంగాణ కన్వీనర్‌ పెండ్యాల రాంరెడ్డి, నాయకులు చింతల శ్రీనివాస్‌ రెడ్డి, జున్నతుల రాజిరెడ్డి, కాంతల సత్యనారాయణ రెడ్డి, కోస్నా వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page