Wednesday, September 18, 2024

రెచ్చగొట్టే పోస్టులు షేర్‌ చేస్తే కఠిన చర్యలు

సిరిసిల్ల-జనత న్యూస్‌
సోషల్‌ మీడియాలో మత విద్వేశాలు, ఇతరాత్ర రెచ్చగొట్టే పోస్టులు షేర్‌ చేసినా, పోస్టులు పెట్టినా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజలెవరూ మతవిద్వేషాలు పెంచేలా పోస్టులు పెట్టవద్దని , శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, ఇంస్టాగ్రామ్‌ మొదలైన వాటిలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫెక్‌ మెసేజ్‌లు, వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్‌ లు చేయడం, ఫార్వార్డ్‌ చేయడం చేయవద్దని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్‌ చేసిన వారితో పాటుగా గ్రూప్‌ ఆడ్మిన్‌ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా సంయమనం పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page