ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు సొంతం చేసుకోవాలను కుంటున్నారా..అయితే..మంగళవారం(నేడు) నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే వేలంలో పాల్గొనండి. వివిధ వర్గాలు, ప్రముఖులు ఇచ్చిన విలువ కట్టలేని అనేక బహుతులను వేలం వేస్తున్నారు. స్పోర్ట్స్ షూ మొదలు కుని వెండి వీణ, ఇతర ప్రతిమలు, వస్తువులు..ఇలా 600 రకాల గిఫ్ట్స్ను వేలం వేస్తున్నారు. వీటి విలువ కోటిన్నరకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్న కాలం నుండి ఇలా వేలం వేస్తూ..ఆ డబ్బును అభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ సారి వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గంగానది ప్రక్షాళన నిధికి అందజేయనున్నట్లు సంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిని దక్కించుకోవాలంటే..వేలం పాటలో పాల్గొని సొంతం చేసుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు సొంతం చేసుకునే అదృష్టవంతులెవరో !
ప్రధాని మోదీ బహుమతులు కావాలా..ఐతే..
- Advertisment -