హైదరాబాద్,జనతా న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా? లేదా? అనుమానాలు వెలువడుతున్న నేపథ్యలో ఆ పార్టీ అధినేత క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై ప్రస్తావన రాగా.. కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ దూరంగా ఉంది. హైదరాబాద్ కార్పరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ మిత్ర పక్షంగా కొసాగింది. ఈసారి పోటీ చేయకుండా పార్టీ మనుగడ కష్టమవుతుందని కొందరు నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో పోటీపై నిర్ణయం తీసుకుంటానన్నట్లు సమాచారం.
తెలంగాణలో పోటీపై త్వరలో తేల్చనున్న పవన్..
- Advertisment -