Thursday, September 19, 2024

పంచభూతాలు మానవాళిని సుభిక్షంగా ఉంచాలి

బిక్షేశ్వరాలయంలోమహన్యాస పూర్వక రుద్రాభిషేకం

మంథని,  జనతా న్యూస్ : దక్షిణ కాశిగా పేరుగాంచిన మంత్రపురి అనే పడే మంథని పట్టణంలోని పంచలింగ క్షేత్రంలో ఒక క్షేత్రమైన శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయంలో పంచభూతాలు మానవాళిని సుభిక్షంగా ఉంచాలని ఉద్దేశంతో వేద పండితులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకమును ఘనంగా నిర్వహించారు. శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మంత్రపురి పంచలింగ క్షేత్రంగా పేరుగాంచింది ఆ దేవాలయాలు శ్రీ ఓంకారేశ్వర్ ఆలయం శ్రీ భిక్షేశ్వర ఆలయం శ్రీ గౌతమేశ్వరాలయం శ్రీ శీలే శ్వర-సిద్దేశ్వర ఆలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి.

వాటిలో అత్యంత ప్రాముఖ్యమైన శైవ క్షేత్రం శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయం కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుడు ఏ విధంగా దర్శనమిస్తాడు పశ్చిమముఖ ద్వారం కలిగిన ఆలయం లో శ్రీ బిక్షేశ్వర స్వామి దక్షిణామూర్తి స్వామి లింగ రూపంలో దర్శనమిస్తాడు ఒకే దేవాలయంలో భిక్షేశ్వరం దక్షిణామూర్తి దర్శనం కలగడం చాలా అరుదు ఈ దేవాలయంలో బిక్షేశ్వరుడు వివాహాలకు ఉన్నత చదువులకు ఉద్యోగాలకు విదేశీ ప్రయాణాలకు సంకటాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం ఈ దేవాలయంలో పాశుపత పూజలు నిర్వహించి భక్తులు వారి యొక్క కార్యసిద్ధిని పొందుతారు ప్రతినెల అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి పురస్కరించుకొని గురువారం శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

దక్షిణ భారతదేశంలో గల పశ్చిమ ముఖ ద్వారం కలిగిన ఏకైక శివాలయం గా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రదోషకాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థం పంచభూతాలు మానవులను సుభిక్షంగా ఉంచాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఉపవాస దీక్షను విరమించి సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పల్లి సంజీవ్ శర్మ ఓజ్జల గణేష్ శర్మ వెంకన్న శర్మ శ్రీరాంభట్ల ఆదిత్య శర్మ మహావాది విజయకుమార్ శర్మ, తనువుల శ్రీవత్సవ శర్మ మహావాది శివకుమార్ శర్మ, డింగిరి హరి శర్మ దహగం త్రయంబక్ శర్మ, నచ్చ గారి సృజన్ యజ్ఞంపట్ల శ్రీకాంత్ డింగిరి అభిరాం రామ్ చరణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page