Wednesday, September 18, 2024

తెలంగాణలో పూడ్చలేని నష్టం

ప్రకృతి విపత్తు ప్రకటనపై ఆశలు
జనత న్యూస్‌ :
తెలంగాణలో ఇటీవల సృష్టించిన ప్రకృతి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాల్లింది. ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినప్పటికీ, అంతకు రెట్టింపులో నష్టం వాటిల్లిఉంటుందని, అయా ప్రాంతాల్లోని హృదయ విధారక దృష్యాలు చూస్తేనే ఇట్టే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మృతి చెందగా, 14వేల మూగ జీవాలు మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 84 ప్రభుత్వ పాఠశాలలు, 6,000 ఇళ్లు, 1900 కి.మీ రోడ్లు ధ్వంసం అయ్యాయి. సూర్యాపేట, భద్రాది కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్ర వ్యాప్తంగా 130 గ్రామాలు దెబ్బతిన్నట్లు ప్రకృతి విపత్తు నిర్వహణ అధికారి హరీష్‌ ప్రకటించారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ప్రకటించారు. మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఒకే సారి 46 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావడం, వరద ఉధృతి గ్రామాలు, పట్టణాలను వరద ఊడ్చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా సాయం ప్రకటించినా, ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో బాధితులకు పూర్తి స్థాయిలో సాయం అందించే పరిస్థితిలో లేనట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించి, వరద బాధితులకు సాయం అందించే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఇందులో ఏ మేరకు సఫలీ కృతమౌతారనేది తేలాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని సాయం అడిగేందుకు అఖిల పక్షంతో కలసి వచ్చేందుకు తాము సిద్దమని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రకటించిన నేపథ్యంలో..రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు .

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page