Thursday, September 19, 2024

Mp Phone Hacking : ఎంపీలకు యాపిల్ హెచ్చరిక.. ఫోన్ హ్యాక్ అవుతున్నాయంటూ మెసేజ్..

Mp Phone Hacking : పలువురు లోక్ సభ  ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపింది. ఎంపీలు యాపిల్ ఐడి ఆధారంగా స్టేట్స్ స్పాన్సర్డ్స్ తమ ఐఫోన్ ఇమెయిల్ హ్యాక్ చేస్తున్నట్లు హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసేజ్ అందుకున్న వారిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొహత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరుర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ , శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఫోన్, ఈమెయిల్ ను హాక్ చేసేందుకు ప్రయత్నిస్తుందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మొహత్రా ఈ సందర్భంగా ఆరోపించారు. ఫోన్ కు వచ్చిన హెచ్చరిక మెసేజ్ స్క్రీన్షాట్ ను ట్విట్టర్లో ఉంచారు. అదేవిధంగా శివసేన రాజ్యసభ ఎంపీ మరో ముగ్గురు ఇండియా కూటమి సభ్యులకు ఈ మెసేజ్ అందినట్టు ఆమె పేర్కొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page