Thursday, September 19, 2024

ఏబీవీపీ నగర కార్యదర్శిగా మాడవేణి సునీల్

జనత న్యూస్,  కోరుట్ల: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నూతన నగర కార్యవర్గాన్ని శుక్రవారం రోజున ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ రాపాక సాయికుమార్ ప్రకటించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, ఈ సమాజంలో అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలతో పాటుగా సామాజిక సమస్యల మీద అనేకమైన ఉద్యమాలు నిర్వహిస్తూ గత 73 సంవత్సరాలుగా ఏబీవీపీ దేశం కోసం సమాజం కోసం పనిచేస్తుందన్నారు.

జాతీయ సిద్ధాంతం పరంగా ముందుకు వెళ్లే విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని , ఇటువంటి సంస్థలో విద్యార్థులందరూ చేరాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా నూతన నగర కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండవసారి కూడా నూతనంగా నియామకమైన నగర కార్యదర్శి మాడవేణి సునీల్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నగర కార్యదర్శగా రెండవసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అని , విద్యారంగ సమస్యల మీద సమాజ సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ జాయింట్ సెక్రెటరీ మాసం వినయ్ , అభిమన్యు, మనోజ్, సాగర్, జోనల్ ఇంచార్జ్ ప్రణయ్ , హర్షవర్ధన్, సూర్య, రాఘవేంద్ర, మాడవేని పవన్, కిరణ్ , నాగేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page